మంత్రుల నుంచి పిలుపు.. తర్జనభర్జనలో ఉద్యోగ సంఘాల నేతలు

ABN , First Publish Date - 2022-01-23T21:11:01+05:30 IST

పీఆర్సీ సాధన సమితి నేతలకు మంత్రుల నుంచి పిలుపు వచ్చింది. మంత్రులతో చర్చించే ముందు స్టీరింగ్ కమిటీతో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు.

మంత్రుల నుంచి పిలుపు.. తర్జనభర్జనలో ఉద్యోగ సంఘాల నేతలు

అమరావతి: పీఆర్సీ సాధన సమితి నేతలకు మంత్రుల నుంచి పిలుపు వచ్చింది. మంత్రులతో చర్చించే ముందు స్టీరింగ్ కమిటీతో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ హాజరైనారు. ఈ భేటీలో మంత్రుల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్‌పై చర్చించినట్లు చెబుతున్నారు. మంత్రుల ఆహ్వానంపై పీఆర్సీ సాధన సమితి నేతలు తర్జనభర్జనలో పడ్డారు. సంప్రదింపులకు వెళ్లితే మంత్రుల ముందు ఎలాంటి ప్రతిపాదనలు పెట్టాలనే దానిపై స్టీరింగ్ కమిటీలో ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకోనున్నాయి. పీఆర్సీ సాధన సమితి నేతలకు మంత్రుల నుంచి పిలుపు వచ్చింది. సంప్రదింపులకు రావాలని మంత్రులు కోరారు. స్టీరింగ్ కమిటీలో చర్చ తర్వాత నిర్ణయం ఉంటుందని నేతలు వెల్లడించారు. పీఆర్సీ జీవోలు రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని సాధన సమితి నేతలు స్పష్టం చేశారు. పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు ఉద్యమబాట పట్టాయి. 

Updated Date - 2022-01-23T21:11:01+05:30 IST