కర్నూలులో కాల్ మనీ కలకలం
ABN , First Publish Date - 2021-11-16T22:42:28+05:30 IST
కర్నూలులో కాల్ మనీ కలకలం సృష్టించింది. అప్పుగా
కర్నూలు: కర్నూలులో కాల్ మనీ కలకలం సృష్టించింది. అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించలేదనే కారణంతో మహిళపై కాల్ మనీ టీం దాడి చేసింది. మహిళ ఇంటికి తాళం వేసి బయటికి వెల్లగొట్టింది. దాడిలొ సింధు అనే మహిళకు తీవ్ర రక్తస్రావం అయింది. ఆమె కర్నూలు జీజీహెచ్లో చికిత్స పొందుతోంది. కాల్ మనీ టీం నుంచి ఆ మహిళ 4.6 లక్షల రూపాయలను అప్పుగా తీసుకుంది. నెలకు లక్షా 10 వేల వడ్డీ చెల్లిస్తోంది. 7 నెలలకు 6.55 లక్షల వడ్డీని ఆ మహిళ చెల్లించింది. డబ్బు చెల్లింపు ఆలస్యం కావడంతో ఇంటిపై కాల్ మనీ టీమ్ దాడి చేసి మహిళను బయటకు వెల్లగొట్టింది. దీంతో పీఎస్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది.