ప్రశాంతంగా పాలీసెట్‌

ABN , First Publish Date - 2022-07-01T05:30:56+05:30 IST

జిల్లాలో పాలీసెట్‌-22 గురువారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రం భువనగిరిలో ఐదు, యాదగిరిగుట్టలో రెండు మొత్తం

ప్రశాంతంగా పాలీసెట్‌
భువనగిరిలో పాలీసెట్‌కు హాజరైన విద్యార్థులు

92 శాతం హాజరు

భువనగిరి టౌన్‌, జూన్‌ 30 : జిల్లాలో పాలీసెట్‌-22 గురువారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రం భువనగిరిలో ఐదు, యాదగిరిగుట్టలో రెండు మొత్తంగా ఏడు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. 1,686మంది విద్యార్థులకు 1,567(92శాతం) మంది హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు, వెంట వచ్చిన సహాయకులతో సందడి కనిపించింది. పాలీసెట్‌లో సాధించిన అర్హత ఆధారంగా 2022-23 విద్యా సంవత్సరానికి పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పాలీసెట్‌ జిల్లా కోఆర్డినేటర్‌ డాక్టర్‌ శ్రీనివా్‌స పరీక్షాకేంద్రాలను తనిఖీ చేశారు.

Updated Date - 2022-07-01T05:30:56+05:30 IST