క్యాంపస్‌ సెలక్షన్స్‌ నిరుద్యోగులకు వరం

ABN , First Publish Date - 2022-01-29T05:53:42+05:30 IST

క్యాంపస్‌ నియామకాలు నిరుద్యోగులకు వరమని కామారెడ్డి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జాహ్నవి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో డాక్టర్‌ రెడ్డీస్‌ కంపెనీ క్యాంపస్‌ సెలక్షన్స్‌ను చేపట్టింది.

క్యాంపస్‌ సెలక్షన్స్‌ నిరుద్యోగులకు వరం

కామారెడ్డి, జనవరి 24: క్యాంపస్‌ నియామకాలు నిరుద్యోగులకు వరమని కామారెడ్డి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జాహ్నవి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో డాక్టర్‌ రెడ్డీస్‌ కంపెనీ క్యాంపస్‌ సెలక్షన్స్‌ను చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇంటర్‌తోనే ఉద్యో గంతోపాటు బిట్స్‌ ఫిలానీలో చదువుకునే అవకాశం కల్పించడంతో గొప్ప విషయమని, ఎంపికైన విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో స్థిర పడాలని ఆమె ఆకాంక్షించారు. క్యాంపస్‌ సెలక్షన్స్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, విజయనగరంతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని అదిలాబాద్‌, కాగజ్‌నగర్‌, నల్గొండ లతోపాటు జిల్లాలోని వివిధ మండలాల నుంచి 70మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి శేఖ్‌సలామ్‌ తెలిపారు. నాలుగు విడత లుగా జరిగిన వివిధ పరీక్షల్లో మొత్తం 5 మంది విద్యార్థినులు ఎంపికయ్యారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ రెడ్డీస్‌ కంపెనీ ప్రతినిధులు చక్రధర్‌, శివారెడ్డిలతోపాటు కళాశాల సిబ్బంది సతీష్‌, దుర్గయ్య, రాజాక్‌లు ఉన్నారు.

Updated Date - 2022-01-29T05:53:42+05:30 IST