పద్యం ప్రాణాలు తీస్తుందా? బంగారం ఇస్తుందా?

ABN , First Publish Date - 2021-12-05T03:12:28+05:30 IST

పద్యాలు మన తెలుగుజాతి సంపద. ఛందస్సు మన సాహితీ వైభవానికి వెలుగునిచ్చిన ఓ వ్యాకరణ ప్రక్రియ..

పద్యం ప్రాణాలు తీస్తుందా? బంగారం ఇస్తుందా?

పద్యాలు మన తెలుగుజాతి సంపద. ఛందస్సు మన సాహితీ వైభవానికి వెలుగునిచ్చిన ఓ వ్యాకరణ ప్రక్రియ. ఓ వ్యాసం లాగో ఉపన్యాసంలాగో విషయాన్ని చెప్పుకుపోకుండా - భావ ప్రకటనతో బాటు భాషా వైదుష్యాన్ని ప్రదర్శిస్తూ మ్యూజికల్‌గా విషయాన్ని చెప్పే ఓ అద్భుత విద్య - పద్యం. మరి తెలుగు పద్యాల్లో ప్రమాదాలూ ఉన్నాయి ప్రమోదాలూ ఉన్నాయి. వేమన పద్యాల్లో వెతుక్కుంటే బంగారం దొరుకుతుంది అని కొందరు అంటారు. ఇప్పటికీ అంటారు. అయితే పద్యం మీద పట్టు సంపాదించిన విద్వాంసుడు విధ్వంసం సృష్టించగలడనీ - పద్యరచనతోనే ప్రాణాలు తీయగలడనీ కొందరు నమ్ముతారు. పద్యంతో చంపడం...  అంటే అదేదో ఎదుటివాడు ఆ పద్యం వినలేక చస్తాడనో... ఆ కవిత్వానికి విసుగుపుట్టి చస్తాడనో కాదు.  ఒక పద్యాన్ని రాసినప్పుడు - ఆ పద్యం ఎవరిని ఉద్దేశించి రాశారో ... ఆ వ్యక్తి ప్రాణం ప్రమాదంలో పడుతుందట. నమ్ముతారా? సాహిత్యంలోనే కమర్షియల్‌ యాంగిల్‌, క్రైమ్‌ యాంగిల్‌.. బలే విచిత్రం కదూ? అదే తెలుగు గొప్పతనం... ఈ వీడియో తప్పనిసరిగా చూడండి.




Updated Date - 2021-12-05T03:12:28+05:30 IST