రూ. కోటి 70లక్షలతో కాలువ నిర్మాణం

ABN , First Publish Date - 2021-01-26T05:27:37+05:30 IST

పట్టణంలోని గాంధీరోడ్డుకు ఇరువైపులా కాలువ నిర్మాణం పనులు రూ.1కోటి 70లక్షలతో ప్రారంభించినట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు.

రూ. కోటి 70లక్షలతో కాలువ నిర్మాణం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

ప్రొద్దుటూరు క్రైం, జనవరి 25 :పట్టణంలోని గాంధీరోడ్డుకు ఇరువైపులా కాలువ నిర్మాణం పనులు రూ.1కోటి 70లక్షలతో ప్రారంభించినట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం గాంధీరోడ్డులోని సుందరాచార్యులవీధిలో కాలువ నిర్మాణం పనులకు ఎమ్మెల్యే పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గాంధీరోడ్డులో ఇరువైపులా కాలువ చాలా అధ్వానంగా ఉండడంతో రూ.1కోటి 70లక్షలతో కాలువ పనులకు శ్రీకారం చుట్టామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రాధ, వైసీపీ నాయకులు బంగారురెడ్డి, వరికూటి ఓబులరెడ్డి, ఆర్‌వీ రమేష్‌, అగ్గారపు శ్రీనివాసులు  పాల్గొన్నారు.

Updated Date - 2021-01-26T05:27:37+05:30 IST