జీవో నెం.77ను రద్దు చేయండి

ABN , First Publish Date - 2021-01-21T06:24:01+05:30 IST

పేదలకు ఉన్నత విద్యను దూరం చేసే జీవో నెం.77ను రద్దు చేయకుంటే ఈనెల 22న సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ (తెలుగునాడు స్టూడెంట్‌ ఫెడరేషన్‌) జిల్లా అధ్యక్షుడు పతివాడ తారకరామానాయుడు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.

జీవో నెం.77ను రద్దు చేయండి

పూసపాటిరేగ: పేదలకు ఉన్నత విద్యను దూరం చేసే జీవో నెం.77ను రద్దు చేయకుంటే ఈనెల 22న సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ (తెలుగునాడు స్టూడెంట్‌ ఫెడరేషన్‌) జిల్లా అధ్యక్షుడు పతివాడ తారకరామానాయుడు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ ప్రణవ్‌ గోపాల్‌ పిలుపుమేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి విద్యా ర్థులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. 

 


Updated Date - 2021-01-21T06:24:01+05:30 IST