నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

ABN , First Publish Date - 2021-04-12T06:01:57+05:30 IST

కరోనా కేసుల ఉధృతి నేపథ్యంలో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఇన్‌చార్జి కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ తెలిపారు.

నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

ఆదిలాబాద్‌టౌన్‌, ఏప్రిల్‌ 11: కరోనా కేసుల ఉధృతి నేపథ్యంలో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి  కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు  ఇన్‌చార్జి కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ తెలిపారు. జిల్లాలో కరోనా కేసులు పెరు గుతున్న కారణంగా ఈ నెల 12న ప్రజావాణి నిర్వ హించడం లేదని, ప్రజలు ఈ విషయాన్ని గమనిం చాలని తెలిపారు. ఎవరైనా అర్జీదారులు ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించనున్నట్లయితే అక్కడే ఏర్పా టు చేసిన డబ్బాలో దరఖాస్తులను వేయాలన్నారు. జిల్లాలోని ప్రజలు కొవిడ్‌ వైరస్‌ భారీన పడకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని తెలిపారు. 

Updated Date - 2021-04-12T06:01:57+05:30 IST