panchayat polls: కుటుంబంలో 12 మంది ఓటర్లున్నా అభ్యర్థికి ఒక్క ఓటే వచ్చింది...షాక్

ABN , First Publish Date - 2021-12-22T13:23:10+05:30 IST

పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి ఒకే ఒక్క ఓటు రావడంతో షాక్ కు గురైన ఉదంతం...

panchayat polls: కుటుంబంలో 12 మంది ఓటర్లున్నా అభ్యర్థికి ఒక్క ఓటే వచ్చింది...షాక్

అహ్మదాబాద్ : పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి ఒకే ఒక్క ఓటు రావడంతో షాక్ కు గురైన ఉదంతం గుజరాత్ రాష్ట్రంలో వెలుగుచూసింది.తన కుటుంబంలో 12 మంది ఓటర్లు ఉన్న అభ్యర్థికి కేవలం ఒకే ఒక్క ఓటు మాత్రమే వచ్చింది.గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో తనకు ఒక్క ఓటు మాత్రమే దక్కిందని గుజరాత్‌లోని ఓ అభ్యర్థి గుండెలు బాదుకున్నాడు.వాపి జిల్లా చర్వాలా గ్రామంలో సర్పంచ్ పదవికి సంతోష్ అనే అభ్యర్థి నామినేషన్ వేశారు. మొత్తం 12 మంది ఓటర్లు ఉన్న తన కుటుంబసభ్యులైనా  తనకు అనుకూలంగా ఓటేస్తారని ఆయన అంచనా వేశారు.అయితే ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక సంతోష్ తనకు ఒకే ఒక్క ఓటు మాత్రమే వచ్చిందని, అది కూడా తన ఓటు మాత్రమే దక్కిందని సంతోష్ గుర్తించారు.


సొంత కుటుంబం కూడా తనకు ఓటేయలేదని కౌంటింగ్ కేంద్రం అభ్యర్థి సంతోష్ ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్‌లోని వివిధ కేంద్రాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా ఈ వింత ఉదంతం వెలుగుచూసింది. అభ్యర్థి కుటుంబంలో మొత్తం పన్నెండు మంది సభ్యులు ఉండగా, వారిలో ఎవరూ కూడా అతనికి ఓటు వేయకపోవడంతో అభ్యర్థి ఓటమి మరింత ఇబ్బందికరంగా మారింది.





Updated Date - 2021-12-22T13:23:10+05:30 IST