చంద్రబాబు, లోకేష్‌ కోలుకోవాలని పూజలు

ABN , First Publish Date - 2022-01-21T02:46:47+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కరోనా నుంచి కోలుకోవాలని

చంద్రబాబు, లోకేష్‌ కోలుకోవాలని పూజలు
ఉదయగిరిలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు

ఉదయగిరి రూరల్‌, జనవరి 20: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కరోనా నుంచి కోలుకోవాలని స్థానిక బీసీ కాలనీలో గల షిరిడీ సాయిబాబా ఆలయంలో గురువారం మండల టీడీపీ కన్వీనర్‌ చింతనబోయిన బయ్యన్న ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు బొజ్జా నరసింహులు, మతకాల శ్రీనివాసులు, ఖాన్‌సా, కోళ్ల జాని, అబీద్‌, రామ్మోహన్‌, నాగయ్య, శివకృష్ణ, మాబాషా తదితరులు పాల్గొన్నారు. 


కలిగిరిలో..

కలిగిరి, జనవరి 20: కరోనా నుంచి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌బాబు త్వరగా కోలుకోవాలని మండల తెలుగుదేశం పార్ట్టీ నాయకులు గురువారం స్థానిక సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, 101 కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చాగంటి జయరామి రెడ్డి, కాకు మహేష్‌, కల్లూరు చంద్రమౌళి, గంగవరపు మదన్‌కుమార్‌,  పూసాల వెంగపనాయుడు, పాములూరి వరప్రసాద్‌, మాధవ, బొగ్గవరపు వేణు, బుజ్జయ్య, హర్షవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2022-01-21T02:46:47+05:30 IST