కాల్వలో కొబ్బరి లోడు లారీ బోల్తా

ABN , First Publish Date - 2021-03-06T06:13:42+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నుంచి కొబ్బరికాయల లోడుతో ఛత్తీస్‌గఢ్‌కు వెళుతున్న కొబ్బరికాయల లోడు లారీ శుక్రవారం తెల్లవారుజామున అల్లవరం మండలం బోడసకుర్రు వైనతేయ వంతెన వద్ద పంటకాల్వలోకి బోల్తా పడింది.

కాల్వలో కొబ్బరి లోడు లారీ బోల్తా

ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్‌, క్లీనర్లు

అల్లవరం, మార్చి 5: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నుంచి కొబ్బరికాయల లోడుతో ఛత్తీస్‌గఢ్‌కు వెళుతున్న కొబ్బరికాయల లోడు లారీ శుక్రవారం తెల్లవారుజామున అల్లవరం మండలం బోడసకుర్రు వైనతేయ వంతెన వద్ద పంటకాల్వలోకి బోల్తా పడింది.  ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టానికి చెందిన డ్రైవర్‌, క్లీనర్లు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. లారీ బోల్తా కొట్టిన సమీపంలో హైవేరోడ్డు రైలింగ్‌ దెబ్బతింది.  బోడసకుర్రు బ్రిడ్డి వద్ద తరచూ వాహన ప్రమాదాలు జరుగుతున్నందున వాహనాల వేగ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 



Updated Date - 2021-03-06T06:13:42+05:30 IST