గంజాయి ముఠా అరెస్ట్

ABN , First Publish Date - 2021-12-22T21:47:51+05:30 IST

జిల్లాలోని కోదాడలో గంజాయిని తరలిస్తున్న ముఠాను

గంజాయి ముఠా అరెస్ట్

సూర్యాపేట: జిల్లాలోని కోదాడలో గంజాయిని తరలిస్తున్న ముఠాను కోదాడ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ఒడిశా నుంచి ముంబైకి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. తమకు అందిన సమాచారంతో వీరిని పట్టుకున్నారు. ముంబై, ఒడిశాకి చెందిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం నుంచి ముంబైకి ట్రైన్‌లో వెళ్లేందుకు వైజాగ్ నుంచి కోదాడకి వచ్చిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 22 కిలోల గంజాయిని   స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-12-22T21:47:51+05:30 IST