పొదుపు మహిళలతో వైసీపీ ఎన్నికల ప్రచారం
ABN , First Publish Date - 2021-04-14T04:39:27+05:30 IST
చెక్కులు ఇస్తామని ఆశచూపి వెలుగు సీసీలు, ఈవోఏలు తమను వైసీపీ ఎమ్మెల్యేల ఎన్నికల ప్రచారానికి తీసుకెళ్లారని పొదుపు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
వాకాడు, ఏప్రిల్ 13 : చెక్కులు ఇస్తామని ఆశచూపి వెలుగు సీసీలు, ఈవోఏలు తమను వైసీపీ ఎమ్మెల్యేల ఎన్నికల ప్రచారానికి తీసుకెళ్లారని పొదుపు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని కల్లూరు పంచాయతీలో మంగళవారం వైసీపీ ఎమ్మెల్యేలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, తోపుదూర్తి ప్రతాప్రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్రావు, జగ్గారెడ్డిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తిరుమూరు, ముట్టెంబాక, సుద్దవరం, కల్లూరు తదితర గ్రామాల నుంచి పొదుపు మహిళలను ప్రచారానికి తీసుకెళ్లారని తెలిపారు. టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ గౌస్మోహిద్దీన్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి వలంటీర్లతోపాటు పొదుపు మహిళలను వాడుకోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వెలుగు ఏపీఎం, సీసీలపై ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.