అమరావతే లేకపోతే పాలన ఎక్కడ నుంచి?
ABN , First Publish Date - 2021-04-19T09:53:43+05:30 IST
రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఉండకూడదని ఆనాటి ప్రభుత్వం భూములు అడిగితేనే ఇచ్చామని అమరావతి రైతులు
సీఎం జగన్పై రాజధాని రైతుల ఆగ్రహం
తుళ్లూరు, ఏప్రిల్ 18: రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఉండకూడదని ఆనాటి ప్రభుత్వం భూములు అడిగితేనే ఇచ్చామని అమరావతి రైతులు స్పష్టం చేశారు. అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలని రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తున్న ఉద్యమం ఆదివారంతో 487వ రోజుకు చేరుకుంది. అమరావతే లేకపోతే పరిపాలన ఎక్కడ నుంచి చే సేవారని సీఎం జగన్ను రైతులు నిలదీశారు. అన్నదాతల త్యాగాలను గుర్తించకుండా శ్మశానం, ఎడారి, ముంపు, ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ అమరావతిపై అపవాదులు వేయడం సరికాదని హితవు పలికారు.