పరిపాలనా రాజధాని తరలింపు త్వరలోనే...
ABN , First Publish Date - 2021-06-18T14:48:06+05:30 IST
‘‘విశాఖకు పరిపాలనా..
కాపులుప్పాడలో పరిపాలనా రాజధాని
ముహూర్తం నిర్ణయించలేదు: విజయసాయి
విశాఖపట్నం: ‘‘విశాఖకు పరిపాలనా రాజధాని ఎప్పుడు తరలించాలనే దానిపై ఇంకా ముహూర్తం నిర్ణయించలేదు. త్వరలోనే తరలింపు ఉంటుంది. దీనికి సంబంధించిన సంకేతాలు గత కొద్దిరోజులుగా అందరికీ అందుతున్నాయి. కాపులుప్పాడలోనే కేపిటల్ వస్తుంది. కాబట్టే నగరంలోని కైలాసగిరి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకూ ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి వీలుగా బీచ్ రోడ్డును ప్రత్యేకంగా సర్వే చేయించాం’’ అని రాజ్యసభ సభ్యుడు, వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి విజయసాయిరెడ్డి అన్నారు. జీవీఎంసీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలపై గురువారం పాత కౌన్సిల్ హాల్లో నిర్వహించిన సమీక్షలో జిల్లా ఇన్చార్జి మంత్రి కన్నబాబు, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులతో కలిసి ఆయన పాల్గొన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకూ ఆయన సమాధానం ఇచ్చారు. ఏ ప్రభుత్వమైనా అప్పులు తీసుకుంటే గ్యారంటీగా ప్రభుత్వ భూములను చూపిస్తుందని అన్నారు. దేశవ్యాప్తంగా ఒకే ఆస్తి పన్ను వుండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ఇచ్చిందన్నారు.