భూములు కొట్టేయాలనే ఉద్దేశంతోనే విశాఖకు రాజధాని తరలింపు: దీపక్రెడ్డి
ABN , First Publish Date - 2020-05-28T22:39:51+05:30 IST
భూములు కొట్టేయాలనే ఉద్దేశంతోనే విశాఖకు రాజధాని తరలింపు: దీపక్రెడ్డి
గుంటూరు: భూములు కొట్టేయాలనే ఉద్దేశంతోనే విశాఖకు రాజధాని తరలిస్తున్నారని టీడీపీ నేత దీపక్రెడ్డి ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీపై ఆరోపణలు చేయడం మొదలెట్టారని, నాలుగు నెలల కాలంలో వైజాగ్లో 500 భూకబ్జా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఐదేళ్లలో రూ.2లక్షల కోట్ల ఆదాయం కొట్టేయాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు. మద్యం ధరలు పెంచడంతో బ్లాక్ మార్కెట్ పెరిగిపోయిందని, మద్యంలో రూ.25వేల కోట్ల స్కామ్ జరుగుతోందని ఆరోపించారు. టీడీపీ హయాంలో ట్రాక్టర్ ఇసుక ధర రూ.3వేలు, ఇప్పుడు రూ.10వేలు పెంచారని దీపక్రెడ్డి దుయ్యబట్టారు.