క్యాప్లిన్ పాయింట్ జోరు
ABN , First Publish Date - 2021-07-26T22:09:11+05:30 IST
క్యాప్లిన్ పాయింట్ జోరు కొనసాగుతోంది.
చెన్నై : క్యాప్లిన్ పాయింట్ జోరు కొనసాగుతోంది. వరుసగా ఆరో సెషన్లోనూ అదే స్పీడ్ నమోదు కావడం విశేషం. తమ ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ నుంచి అనుమతి లభించడంతో ఈ స్టాక్ ఈ రోజు(సోమవారం) ఇంట్రాడేలో దాదాపు 19 శాతం లాభపడి, డే గరిష్ట స్థాయి రూ. 944.50 కు చేరుకుంది. ఇది రికార్డ్ స్థాయి గరిష్టం కావడం విశేషం. ప్రస్తుతం డే గరిష్ట స్థాయికి సమీపంలో 18.50 శాతం లాభంతో రూ. 938 వద్ద షేర్ ట్రేడవుతోంది.
ఇక ఈ రోజు ఇప్పటివరకు ఎన్ఎస్ఈలో 52.50 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 7,068 కోట్లకు చేరింది. ఈ నెలలో ఇప్పటివరకు క్యాప్లిన్ పాయింట్ 40 శాతానికి పైగా లాభపడింది. ఇదే సమయంలో బీఎస్ఈ హెల్త్కేర్ ఇండెక్స్ 3.8శాతం పెరిగింది.