జట్టులో కెప్టెన్‌కు ప్రాధాన్యం ఉండదు: రోహిత్

ABN , First Publish Date - 2020-08-06T03:04:09+05:30 IST

సారధ్య బాధ్యతలు తీసుకుంటే జట్టులో మన ప్రాధాన్యం తగ్గిపోతుందని ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.

జట్టులో కెప్టెన్‌కు ప్రాధాన్యం ఉండదు: రోహిత్

ముంబై: సారధ్య బాధ్యతలు తీసుకుంటే జట్టులో మన ప్రాధాన్యం తగ్గిపోతుందని ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. గెలుపు కోసం వేసే పథకంలో కెప్టెన్ పాత్ర చాలా వరకు పరిమితంగానే ఉంటుందని రోహిత్ అభిప్రాయపడ్డాడు. ‘గెలుపు కోసం వేసిన పథకంలో జట్టు సభ్యులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తారనేది నా అభిప్రాయం. వేరే వేరే కెప్టెన్ల అభిప్రాయాలు వేరు వేరుగా ఉండొచ్చు. నా వరకైతే ఈ అభిప్రాయం కరెక్టే అనిపిస్తుంది’ అని రోహిత్ పేర్కొన్నాడు.

Updated Date - 2020-08-06T03:04:09+05:30 IST