పాకిస్తాన్ జర్నలిస్ట్తో సోనియా: ఫొటో షేర్ చేసిన కెప్టెన్
ABN , First Publish Date - 2021-10-24T00:22:27+05:30 IST
అటు పంజాబ్ కాంగ్రెస్ అధినేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ సహా అనేక మంది కాంగ్రెస్ నేతలు అమరీందర్పై విమర్శలు గుప్పిస్తుంటూ తనకు సమయం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ను ఇరుకున పెట్టేందుకు అమరీందర్ ప్రయత్నిస్తున్నారు...
చండీగఢ్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్కు ఐఎస్ఐతో సంబంధాలు ఉన్న పాకిస్తానీ జర్నలిస్ట్ అరూసా అలంతో లింకులు ఉన్నాయని, ఈ విషయమై ఆయనపై విచారణ జరగనుందని పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖిందర్ సింగ్ రాంధావా శుక్రవారం వ్యాఖ్యానించారు. కాగా, అరూసా ఆలంతో కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ తీసుకున్న ఫొటోలను అమరీందర్ సింగ్ శనివారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. స్నేహాన్ని, రాజకీయాల్ని కలిపి చూస్తున్నారని, అరూసా ఆలంతో గాంధీ కుటుంబం ఎన్నోసార్లు కలిసిందని మరి దీనికి కాంగ్రెస్ నేతలు ఏమంటారని కెప్టెన్ ప్రశ్నించారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా కెప్టెన్ తొలగించినప్పటి నుంచి కాంగ్రెస్ వర్సెస్ కెప్టెన్ ఫైట్లా తయారయింది పంజాబ్లో పరిస్థితి. అటు పంజాబ్ కాంగ్రెస్ అధినేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ సహా అనేక మంది కాంగ్రెస్ నేతలు అమరీందర్పై విమర్శలు గుప్పిస్తుంటూ తనకు సమయం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ను ఇరుకున పెట్టేందుకు అమరీందర్ ప్రయత్నిస్తున్నారు.