పీలేరులో కారు దగ్ధం
ABN , First Publish Date - 2022-01-17T07:03:00+05:30 IST
పీలేరులో కారు దగ్ధమైన సంఘటన ఆదివారం జరిగింది.
పీలేరు, జనవరి 16: పీలేరు కారు దగ్ధమైన సంఘటన ఆదివారం జరిగింది. వివరాలివీ.. పట్టణ పరిధిలోని అయ్యప్పరెడ్డికాలనీకి చెందిన అల్తాఫ్, ప్రేమ్వున్నీషా దంపతులు శనివారం రాత్రి ఇంటి ముందు మారుతి డిజైర్ కారు నిలిపి ఉంచారు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కారు నుంచి పెద్దఎత్తున మంటలు రేగాయి. అల్తాఫ్ సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమై రూ.7లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. సంఘటనపై అర్బన్ ఇన్చార్జి సీఐ తులసీరాం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.