కారు ఢీకొని గొర్రెలు మృతి

ABN , First Publish Date - 2022-05-22T03:02:44+05:30 IST

కంటికి రెప్పలా గొర్రెల మంద ను కాపాడుకొంటూ వలసవెళ్లిన కాపారులు తిరిగి స్వగ్రా మాలకు చేరుకొనే తరుణంలో ఓ కా

కారు ఢీకొని గొర్రెలు మృతి
మృతి చెందిన గొర్రెలు

వరికుంటపాడు, మే 21: కంటికి రెప్పలా గొర్రెల మంద ను కాపాడుకొంటూ వలసవెళ్లిన కాపారులు తిరిగి స్వగ్రా మాలకు చేరుకొనే తరుణంలో ఓ కారు ఆ మందపైకి దూసు కెళ్లింది. దీంతో ఐదు గొర్రెలు మరణించాయి. మరో 15  గొర్రెలు గాయపడ్డాయి. ఈ సంఘటన శనివారం రామాపురం సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పెద్దిరెడ్డిపల్లికి చెందిన అరవ తిరుపతయ్య, బొల్లిగొర్ల మహాలక్ష్మయ్యల తోపాటు తొడుగుపల్లికి దనేంకుల నాగేశ్వరరావు, బాల య్యలు తమ గొర్రెల మందలతో సంగం ప్రాంతానికి వలస వెళ్లి తిరిగి స్వగ్రామానికి చేరుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున వేగంగా వెళ్తున్న కారు గొర్రెల మందపైకి దూసుకెళ్లడంతో ఐదు గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మరో 15 గొర్రెలకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. ఇంటి చేరుకొనే లోపే ఇలా జరగంతో వాటి యజమానులు బోరున విలపిస్తున్నారు. ఎస్‌ఐ బాలమహేంద్రనాయక్‌ సంఘటనా స్ధలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-05-22T03:02:44+05:30 IST