కారు ఢీకొని ఐదుగురికి గాయాలు

ABN , First Publish Date - 2021-03-02T05:43:40+05:30 IST

కారు ఢీకొని ఐదుగురికి గాయాలైన సంఘటన కొవ్వూరు పట్టణంలో చోటుచేసుకుంది.

కారు ఢీకొని ఐదుగురికి గాయాలు

కొవ్వూరు, మార్చి 1 : కారు ఢీకొని ఐదుగురికి గాయాలైన సంఘటన కొవ్వూరు పట్టణంలో చోటుచేసుకుంది. సోమవారం ఉదయం కొవ్వూరు పట్టణంలోని నందమూరు రోడ్‌ బుద్దుడు బొమ్మ వద్ద కొవ్వూరు నుంచి వస్తున్న కారు నందమూరు  రోడ్‌ వైపు నుంచి వస్తున్న రెండు మోటారు సైకిళ్లను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా దెబ్బతిని ఐదుగురికి గాయాలయ్యాయి. ఇందులో పసివేదల గ్రామానికి చెందిన గున్నమనీడి రేణుకు పరిస్థితి విషమంగా ఉండడంతో అత్యవసర వైద్యం కొరకు రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు.  పాఠశాలకు వెళ్తున్న ఈమె ఇద్దరు  పిల్లలు గాయపడిన వారిలో ఉన్నారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను 108లో కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. గాయపడిన మిగతావారి వివరాలు తెలియలేదు.


Updated Date - 2021-03-02T05:43:40+05:30 IST