కారు బోల్తా... ముగ్గురుకి గాయాలు
ABN , First Publish Date - 2021-05-13T05:09:47+05:30 IST
స్థానిక ఆదర్శపాఠశాల సమీపాన జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా పడింది.
భోగాపురం : స్థానిక ఆదర్శపాఠశాల సమీపాన జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురుకి స్వల్ప గాయాలయ్యాయి. బాధితుల కథనం మేరకు శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తుండగా... డ్రైవర్ సడన్గా బ్రేక్ వేయడంతో కారు బోల్తాపడింది. కాగా ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.