జనాభా లెక్కింపులో జాగ్రత్త వహించాలి

ABN , First Publish Date - 2022-01-19T05:36:44+05:30 IST

జనాభా లెక్కింపులో అధి కారులు జాగ్రత్త వహించాలని అదనపు కలెక్టర్‌ వి.చంద్రశేఖర్‌ సూచించారు.

జనాభా లెక్కింపులో జాగ్రత్త వహించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌

అదనపు కలెక్టర్‌ వి.చంద్రశేఖర్‌

నల్లగొండ టౌన్‌, జనవరి 18: జనాభా లెక్కింపులో అధి కారులు జాగ్రత్త వహించాలని అదనపు కలెక్టర్‌ వి.చంద్రశేఖర్‌ సూచించారు. ప్రతీ ఇల్లు, ప్రతీ వ్యక్తి వివరాలు జనాభా లెక్కల్లో కి తీసుకోవాలని, ఎన్యుమరేటర్లు ఈ విషయంలో జాగ్రత్తపడాలన్నారు. కలెక్టరే ట్‌ నుంచి తహసీల్దార్లు, మునిసిపల్‌ కమిషనర్లు, సహాయ గణాంక అధికారుల తో జన గణనపై మంగళవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. 2021 జనగణనలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ గ్రామం యూనిట్‌గా, అర్బన్‌ ప్రాంతాల్లో మునిసిపల్‌ వార్డు యూనిట్‌గా తీసుకోవాలని సూచించారు. జనాభా లెక్కలకు సంబంధించి గైడ్‌లైన్స్‌ అర్థం చేసుకు ని, సంబంధిత జాబితాలో వివరాలు నమోదు చేయాలన్నారు. అధికారులు పొరపాట్లకు తావివ్వకుండా, సాంకేతిక సమస్యలు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈనెల 27వ తేదీ వరకు డ్రాఫ్ట్‌లను సిద్ధం చేయాలన్నారు. నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి అధికారి పీవీ సుబ్రహ్మణ్యం వర్క్‌షీట్లు ఎలా నింపాలో వివరించారు. కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ కృష్ణమూర్తి, ఎన్నికల డీటీ విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-19T05:36:44+05:30 IST