నాటిన మొక్కలను సంరక్షించుకోవాలి
ABN , First Publish Date - 2022-06-30T07:03:38+05:30 IST
నాటిన మొక్కలను సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని డీఆర్డీవో పీడీ విజయలక్ష్మి అన్నారు.
సోన్, జూన్ 29 : నాటిన మొక్కలను సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని డీఆర్డీవో పీడీ విజయలక్ష్మి అన్నారు. బుధవారం మండలంలోని కడ్తాల్ గ్రామ సమీపంలోని జాతీయ రహదారికి ఇరు వైపులా మొక్కలు నాటేందుకు చేపడుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... హరితహారంలో భాగంగా మొక్కలు నాటుటకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి మొక్కను సంరక్షించే విధంగా ట్రీ గార్డులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జీవన్ రెడ్డి, ఈజీఎస్ ఏపీఎం మంజుల, తదితరులు ఉన్నారు.