ఇండియా ఓపెన్కు మారిన్, మొమోటా
ABN , First Publish Date - 2021-04-14T08:52:14+05:30 IST
ఒలింపిక్ చాంపియన్ కరోలినా మారిన్, పీవీ సింధు, పురుషుల బ్యాడ్మింటన్ వరల్డ్ నెంబర్ వన్ కెంటో మొమోటా, కిడాంబి శ్రీకాంత్ సహా పలువురు స్టార్ షట్లర్లు ఈ ఏడాది ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో...
- బయోబబుల్లో టోర్నీ
న్యూఢిల్లీ: ఒలింపిక్ చాంపియన్ కరోలినా మారిన్, పీవీ సింధు, పురుషుల బ్యాడ్మింటన్ వరల్డ్ నెంబర్ వన్ కెంటో మొమోటా, కిడాంబి శ్రీకాంత్ సహా పలువురు స్టార్ షట్లర్లు ఈ ఏడాది ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో పాల్గొననున్నారు. మే 11 నుంచి 16 వరకు పూర్తి బయోబబుల్ వాతావరణంలో టోర్నీ జరగనుంది. ఈ సూపర్-500 ఈవెంట్కు ప్రేక్షకులను అనుమతించడం లేదని భారత బ్యాడ్మింటన్ సమాఖ్య తెలిపింది. చైనాతో సహా మొత్తం 33 దేశాలకు చెందిన 228 మంది షట్లర్లు ఇందులో తలపడనుండగా భారత్ నుంచి 48 మంది పోటీపడుతున్నారు. ఈనెల 20న టోర్నీ డ్రాలను తీయనున్నారు.