ఇరు జిల్లాల్లో 249 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-06-21T04:29:25+05:30 IST

ఇరు జిల్లాల్లో 249 మందికి కరోనా

ఇరు జిల్లాల్లో 249 మందికి కరోనా

ఖమ్మం కలెక్టరేట్‌/కొత్తగూడెం కలెక్టరేట్‌, జూన్‌ 20: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం 249మంది కరోనా బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో 4,205 మందికి పరీక్షలు నిర్వహించగా 153 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాలతి తెలిపారు. ఇక 330పడకలున్న ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్‌ వార్డులో ఆదివారం 23మంది చేరగా.. మొత్తం 175మంది చికిత్స పొందుతున్నారని, ఆదివారం ఇద్దరు మృతిచెందారని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి. వెంకటేశ్వర్లు తెలిపారు. భద్రాద్రి జిల్లాలో మొత్తం 6,985 మందికి పరీక్షలు నిర్వహించగా 95మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇక ఇరు జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ కొనసాగుతుండగా ఖమ్మం జిల్లాలో ఆదివారం 5,280మంది, భద్రాద్రి జిల్లాలో 1,576మంది టీకా తీసుకున్నారు.

Updated Date - 2021-06-21T04:29:25+05:30 IST