ఇరు జిల్లాల్లో 562 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-06-22T05:11:42+05:30 IST

ఇరు జిల్లాల్లో 562 మందికి కరోనా

ఇరు జిల్లాల్లో 562 మందికి కరోనా

ఖమ్మం కలెక్టరేట్‌, జూన్‌ 21:ఉమ్మడి ఖమ్మంజిల్లాలో సోమవారం 562 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7,493 మందికి పరీక్షలు నిర్వహించగా 367పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాలతి తెలిపారు. ఖమ్మం ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్‌ వార్డులో సోమవారం 21మంది పాజిటివ్‌తో చేరారు.ఈ వార్డులో ప్రస్తుతం 158 మంది  వైద్య సేవలు పొందుతుండగా 172 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 9,177మందికి పరీక్షలు నిర్వహించగా 195మందికి పాజిటివ్‌ వచ్చిందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ జిల్లాలో సోమవారం 3505మంది కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

Updated Date - 2021-06-22T05:11:42+05:30 IST