ఈ జిల్లాల్లో దారుణంగా కరోనా కేసులు...

ABN , First Publish Date - 2020-08-09T18:23:28+05:30 IST

జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 462 కొత్త కేసులు శనివారం నమోదయ్యాయి. ఆ తర్వాత... కేసుల తాకిడి అత్యధికంగా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో ఉంది. తెలంగాణలో శనివారం నమోదైన కరోనా కేసులకు సంబంధించిన బులెటిన్‌ విడుదల చేశారు.

ఈ జిల్లాల్లో దారుణంగా కరోనా కేసులు...

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 462 కొత్త కేసులు శనివారం నమోదయ్యాయి. ఆ తర్వాత... కేసుల తాకిడి అత్యధికంగా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో ఉంది. తెలంగాణలో శనివారం నమోదైన కరోనా కేసులకు సంబంధించిన బులెటిన్‌ విడుదల చేశారు.


శనివారం మొత్తం 1,982 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా ఈ నివేదికలో వెల్లడైంది. ఈ క్రమంలో... రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 79,495 కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 22,869 ఉన్నాయి. గత 24 గంటల్లో 1,669 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.


ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 55,999 గా ఉంది. ఇక శనివారం మరో పన్నెండు మంది కరోనాకు బలి కాగా, మొత్తం చనిపోయిన వారి సంఖ్య 627 కు చేరింది. శనివారం గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున కేసులు నమోదైనట్లు వెల్లడైంది. 


 

Updated Date - 2020-08-09T18:23:28+05:30 IST