భారత దేశంలో కొత్తగా 15,144 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-01-17T17:20:23+05:30 IST
భారత దేశంలో కరోనా ఉధృతి తగ్గింది. గత 24 గంటల్లో కొత్తగా 15,144 మందికి కోరోనా నిర్ధారణ కాగా..
న్యూఢిల్లీ: భారత దేశంలో కరోనా ఉధృతి తగ్గింది. గత 24 గంటల్లో కొత్తగా 15,144 మందికి కోరోనా నిర్ధారణ కాగా.. 181 మంది మరణించారు. భారత్లో ఇప్పటి వరకు కోటి 55లక్షల 7వేల 985 పాజిటీవ్ కేసులు నమోదుకాగా.. లక్షా 52 వేల 274 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 2 లక్షల 8 వేల 826 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరి రేటు 96.58 శాతం ఉండగా.. మరణాల రేటు 1.44 శాతానికి తగ్గిందని ఆదివారం ఉదయం కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో పేర్కొంది.