భారత్‌లో కొత్తగా 18,987 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-10-14T17:35:56+05:30 IST

దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా...

భారత్‌లో కొత్తగా 18,987 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 18,987 కరోనా కేసులు నమోదయ్యాయి. 246 మంది మృతి చెందగా.. 19,807 మంది పాజిటీవ్ బాధితులు కోలుకున్నారు. దేశంలో మొత్తం ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 3,40,20,730కి చేరగా.. 4,51,435 మృతి చెందారు. కరోనా చికిత్స నుంచి 3,33,62,709 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 2,06,586 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 96,82,20,997 మందికి టీకా పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది.

Updated Date - 2021-10-14T17:35:56+05:30 IST