భారత్‌లో కొత్తగా 3,06,064 కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-01-24T17:03:25+05:30 IST

న్యూఢిల్లీ: భారత్ దేశంలో కరోనా మమహ్మరి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది.

భారత్‌లో కొత్తగా 3,06,064 కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత దేశంలో కరోనా మమహ్మరి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. చాపకింద నీరులా పాకుతుంది. రోజుకు లక్షల సంఖ్యల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 3,06,064 కరోనా కేసులు నమోదు కాగా 439 మంది మరణించారు. చికిత్స నుంచి కోలుకుని 2,43,495 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 22,49,335కు చేరగా.. రోజువారీ పాజిటివీటి రేటు 20.75 శాతంగా ఉంది. రికవరి రేటు 93.07 శాతం నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది.

Updated Date - 2022-01-24T17:03:25+05:30 IST