తెలంగాణలో కొత్తగా 2,055 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-04-08T16:16:47+05:30 IST
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ వేవ్ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ వేవ్ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 2,055 కరోనా కేసులు నమోదు కాగా.. ఏడుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన పాజిటీవ్ కేసుల సంఖ్య 3,18,704కి చేరగా.. 1,741 మంది మరణించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 13,362 యాక్టివ్ కేసులు ఉండగా, చికిత్స నుంచి కోలుకుని 3,03,601 లక్షల మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో పేర్కొన్నారు.