తెలంగాణలో కొత్తగా ఐదువేల కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-04-18T17:01:43+05:30 IST
తెలంగాణలో సెకండ్ వేవ్ కరోనా వైరస్ విజృంభిస్తోంది. భారీగా పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి.
హైదరాబాద్: తెలంగాణలో సెకండ్ వేవ్ కరోనా వైరస్ విజృంభిస్తోంది. భారీగా పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 5,093 కరోనా కేసులు నమోదు కాగా.. 15 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన పాజిటీవ్ కేసుల సంఖ్య 3,51,424కు చేరగా.. 1,824 మంది మరణించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 37,037 యాక్టివ్ కేసులు ఉండగా, చికిత్స నుంచి కోలుకుని 3,12,563 మంది డిశ్చార్జ్ అయ్యారని, 24,156 మంది హోం ఐసోలేషన్లో చికిత్సపొందుతున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో పేర్కొన్నారు. కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 743 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా తెలంగాణలో కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత ఇవే అత్యధిక కేసులు.