ఇరు జిల్లాల్లో 613 కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-01-19T05:02:54+05:30 IST

ఇరు జిల్లాల్లో 613 కరోనా కేసులు

ఇరు జిల్లాల్లో 613 కరోనా కేసులు

 కలెక్టరేట్లలో కరోనా కలవరం

ఖమ్మం కలెక్టరేట్‌/కొత్తగూడెం కలెక్టరేట్‌, జనవరి 18: ఉమ్మడి జిల్లాలో మంగళవారం 613మంది కరోనా బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో మొ త్తం 6,300మందికి పరీక్షలు నిర్వహించగా 473, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5,652మందికి పరీక్షలు చేయగా 140మందికి పాజిటివ్‌ నిర్ధార ణైంది. 320 బెడ్లున్న ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్‌ వార్డులో మంగళ వారం నలుగురు చేరగా.. మొత్తం 25మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే పోలీస్‌స్టేషన్లు, కార్యాలయాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా ఖమ్మం, భద్రాద్రి కలెక్టరేట్లలోనూ కలవరం రేపింది. ఖమ్మం కలెక్టరేట్‌లోని భూసేకరణ విభాగానికి చెందిన డీటీ, ఎన్నికల విభాగం డీటీ, ఎంహెచ్‌సీ విభాగంలో మరో డీటీతో పాటు మరో అధికారికి పాజిటివ్‌ వచ్చినట్లు సమాచారం. కొత్తగూడెం కలెక్టరేట్‌లో పనిచేస్తున్న 82మంది సిబ్బందికి మంగళవారం పరీక్షలు నిర్వహించగా 10మందికి పాజిటివ్‌ వచ్చింది. అదనపు కలెక్టర్‌ కె వెంకటేశ్వర్లు, అతడి డ్రైవర్‌, డీఆర్‌వో డ్రైవర్‌తో పాటు మరి కొందరికి పాజిటివ్‌ వచ్చింది. 

Updated Date - 2022-01-19T05:02:54+05:30 IST