కరోనా పరీక్షలకు పాట్లు

ABN , First Publish Date - 2020-07-14T10:10:37+05:30 IST

కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్ష చేయించుకోవడం ప్రహసనంగా మారుతోంది. గంటల తరబడి నిరీక్షించినా పరీక్ష చేయించుకోలేక ..

కరోనా పరీక్షలకు పాట్లు

ప్రభుత్వ ఛాతీ, అంటువ్యాధుల ఆసుపత్రిలో తప్పని తిప్పలు


విశాఖపట్నం, జూలై 13(ఆంధ్రజ్యోతి) : కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్ష చేయించుకోవడం ప్రహసనంగా మారుతోంది. గంటల తరబడి నిరీక్షించినా పరీక్ష చేయించుకోలేక ఎంతోమంది వెనుదిరుగుతున్నారు. సోమవారం ఉదయం పదుల సంఖ్యలో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తులు పరీక్ష చేయించుకునేందుకు ప్రభుత్వ ఛాతీ, అంటువ్యాధుల ఆసుపత్రి వద్ద బారులు తీరారు. భారీ సంఖ్యలో అనుమానితులు రావడంతో ఆసుపత్రి సిబ్బంది లోపలకు అనుమతించలేదు. దీంతో గంటల తరబడి బాధితులు బయటే నిరీక్షించారు. కరోనా అనుమానిత లక్షణాలతో ఆసుపత్రికి వస్తుంటే పరీక్షలు చేయించడంలో సిబ్బంది అలసత్వాన్ని వహిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-07-14T10:10:37+05:30 IST