అశోకగజపతిరాజుపై కేసు: హైకోర్టు స్టే

ABN , First Publish Date - 2021-08-03T23:21:21+05:30 IST

మాన్సాస్ చైర్మన్ అశోకగజపతిరాజుపై నమోదైన కేసు విచారణ తదనంతర

అశోకగజపతిరాజుపై కేసు: హైకోర్టు స్టే

అమరావతి: మాన్సాస్ చైర్మన్ అశోక్ గజపతిరాజుపై నమోదైన కేసు విచారణతో పాటు తదనంతరం ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. తనతో పాటు మాన్సాస్ ఉద్యోగులపై నమోదైన కేసు కొట్టివేయాలని అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు.  మాన్సాస్ చైర్మన్‌గా అశోక్ గజపతిరాజు పునర్ నియామకంపై సంచయిత గజపతి.. సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజనల్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను అనుమతించేందుకు ఈ నెల 10న వాదనలు వింటామని డివిజనల్ బెంచ్ పేర్కొంది. అయితే అశోక్ గజపతిరాజు, మరికొంత మాన్సాస్ ఉద్యోగులపై పెట్టిన కేసుకు సంబంధించి మాత్రం తదనంతర చర్యలు ఏవీ తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ కానున్నాయి. మళ్లీ విచారణ ఎప్పుడనేది  ఉత్తర్వుల్లో పేర్కొనే అవకాశం ఉంది.

Updated Date - 2021-08-03T23:21:21+05:30 IST