ఫిర్యాదుకు వెళ్లిన టీడీపీ నేతలపై కేసు
ABN , First Publish Date - 2021-05-14T08:55:34+05:30 IST
పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన టీడీపీ నేతలపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్440కే మ్యూటెంట్ రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తుందంటూ మీడియాలో మంత్రి అప్పలరాజు చేసిన ప్ర
గుంటూరు, మే 13: పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన టీడీపీ నేతలపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్440కే మ్యూటెంట్ రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తుందంటూ మీడియాలో మంత్రి అప్పలరాజు చేసిన ప్రకటనపై టీడీపీ నేతలు బుధవారం గుంటూరులోని అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గుంపులుగా పోలీస్ స్టేషన్కు వచ్చారని, కరోనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ గుంటూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ సహా పలువురిపై సెక్షన్లు 188, 269 ప్రకారం కేసు నమోదు చేశారు. కాగా, టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై న్యాయ సలహా కోసం కోర్టుకు పంపామని పోలీసులు తెలిపారు.