గొడవపడిన ఏడుగురిపై కేసు

ABN , First Publish Date - 2021-10-18T04:50:32+05:30 IST

గొడవపడిన ఏడుగురిపై కేసు

గొడవపడిన ఏడుగురిపై కేసు

యాచారం: తాడిపర్తిలో కనకదుర్గమాత విగ్రహాన్ని నిమజ్జనానికి కోసం తరలిస్తుండగా స్వల్ప ఉద్రిక్తతకు దారితీసిన ఘటన శనివారం రాత్రి తాడిపర్తిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... గొల్లగూడ నుంచి దుర్గామాత విగ్రహాన్ని చెరువులో నిమజ్జనానికి యువకులు తరలిస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మరో విగ్రహం కూడా నిమజ్జనం కోసం తరలిస్తున్నారు. గొల్లగూడ వైపు నుంచి వచ్చిన విగ్రహం వారు తమకు దారి ఇవ్వాలని గ్రామపంచాయతీ  వద్ద ఉన్న విగ్రహ నిర్వాహకులను కోరారు. ఇది  వినిపించుకోని యువకులు ట్రాక్టర్‌ను అక్కడే వదిలేసి పక్కకు తప్పుకున్నారు. ఓ యువకుడు ట్రాక్టర్‌ను పక్కకు తీస్తుండగా కొంత మంది యువకులు గొడవకు దిగారు. దాంతో స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనను విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌ కిరణ్‌కుమార్‌ వీడియో తీస్తుండగా శ్రీహరి అనే యువకుడు  కానిస్టేబుల్‌  చేతిలో ఉన్న మొబైల్‌ను లాక్కొని అతడి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై కానిస్టేబుల్‌ సీఐ లింగయ్య కు వివరించాడు. దీంతో అకారణంగా గలాటాకు కారకులైన ఏడుగురిపై కేసులు  నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.

Updated Date - 2021-10-18T04:50:32+05:30 IST