వైసీపీ నేతపై కేసు నమోదు
ABN , First Publish Date - 2020-05-28T11:47:03+05:30 IST
అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్న మూల్పూరు గ్రామానికి చెందిన కొండేటి శివనాగులుపై దౌర్జన్యం చేసి
అమృతలూరు, మే 27: అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్న మూల్పూరు గ్రామానికి చెందిన కొండేటి శివనాగులుపై దౌర్జన్యం చేసి గాయపర్చారనే ఫిర్యాదుమేరకు వైసీపీ నాయకుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వైసీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యలవర్తినాగభూషణం... వ్యక్తిగతంగా విమర్శించావంటూ తనను ఇంటికి పిలిపించుకుని కొట్టినట్లు బాధితురాలు ఫిర్యాదుచేసి అనంతరం తెనాలి వైద్యశాలకు వెళ్లి చికిత్సపొందారు. ప్రభుత్వ వైద్యశాల నుంచి వచ్చిన రిపోర్టు మేరకు ఎస్ఐ పాపారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.