కాఫీ, టీ ఇచ్చి పంపితే హత్యాయత్నం కేసు పెడతారా?: లోకేష్

ABN , First Publish Date - 2021-10-21T23:53:33+05:30 IST

ప్రజల కోసం పోరాడుతోంటే కేసులు పెడుతున్నారని టీడీపీ నేత లోకేష్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

కాఫీ, టీ ఇచ్చి పంపితే హత్యాయత్నం కేసు పెడతారా?: లోకేష్

అమరావతి: ప్రజల కోసం పోరాడుతుంటే కేసులు పెడుతున్నారని టీడీపీ నేత లోకేష్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను జైలుకెళ్లడానికైనా సిద్ధమని ప్రకటించారు. తాను దేశాన్ని దొబ్బి జైలుకెళ్లడం లేదని చెప్పారు. పార్టీ కార్యాలయంలోకి జొరబడ్డ సీఐకి కాఫీ, టీ ఇచ్చి పంపితే హత్యాయత్నం కేసు పెట్టారని తెలిపారు. తల పగులకొడితే పెట్టీ కేసు పెట్టారని, తాము అమ్మ మొగుడని అనలేదే..? అని ప్రశ్నించారు. పట్టాభి ఏదో అన్నాడని ఫీలవుతోన్న సీఎం జగన్.. తన వద్దనున్న మంత్రి ఏపీలోని తల్లులందర్నీ తప్పుడు మాటలు అనలేదా? అని ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంపై దాడి చేసిన రోజు తాము రెచ్చగొడితే డీజీపీ ఆఫీస్ ఉండేదా అని లోకేష్ నిలదీశారు. పార్టీ గుర్తింపు రద్దు చేయమని వైసీపీ ఫిర్యాదు చేస్తే చేసుకోనివ్వండి.. నష్టం లేదని తేల్చిచెప్పారు. వైసీపీ ఇంకా ఇదే విధంగా రెచ్చగొట్టినా.. దాడులు చేసినా చూస్తూ ఊరుకోం.. తలలు పగులుతాయని లోకేష్ హెచ్చరించారు. 

Updated Date - 2021-10-21T23:53:33+05:30 IST