కేసు నమోదు
ABN , First Publish Date - 2022-01-24T05:48:46+05:30 IST
మండలంలోని మదిరె గ్రామానికి చెందిన 12 మందిపై ఇస్వీ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆదోని రూరల్, జనవరి 23: మండలంలోని మదిరె గ్రామానికి చెందిన 12 మందిపై ఇస్వీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం గ్రామ శివారులోని పంట పొలాల్లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో ఇస్వీ ఎస్ఐ విజయలక్ష్మి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 2 మందిని అదుపులోకి తీసుకుని రూ.3600 నగదుతో పాటు 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.