ఇంటర్ బాలికపై అత్యాచారం- పోలీసులకు తల్లి ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-03-22T18:02:52+05:30 IST

బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పంజాగుట్ట పోలీసులు యువకుడిపై పొక్సో తదితర చట్టాల కింద కేసు నమోదు చేశారు. వివరాలలోకి వెళ్తే బాలిక ఇంటర్మీడియట్‌ చదువుతోంది.

ఇంటర్ బాలికపై అత్యాచారం- పోలీసులకు తల్లి ఫిర్యాదు

పంజాగుట్ట, హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పంజాగుట్ట పోలీసులు యువకుడిపై పొక్సో తదితర చట్టాల కింద కేసు నమోదు చేశారు. వివరాలలోకి వెళ్తే బాలిక ఇంటర్మీడియట్‌ చదువుతోంది. ప్రతిరోజూ సాయంత్రం ట్యూషన్‌కు వెళ్లివచ్చేది. ఈ క్రమంలో ఓ యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండడంతో ఈ నెల 3న వైద్యులను సంప్రదించగా లైంగిక దాడి జరిగినట్లు తెలిసింది. ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఉండడంతో ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదు. బాధితురాలి తల్లి శుక్రవారం రాత్రి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2020-03-22T18:02:52+05:30 IST