చంద్రబాబుపై మైలవరంలో ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-05-15T09:46:56+05:30 IST
మాజీ సీఎం చంద్రబాబుపై కృష్ణా జిల్లా మైలవరం పోలీస్స్టేషన్లో ఇద్దరు న్యాయవాదులు శుక్రవారం ఫిర్యాదుచేశారు.
జి.కొండూరు, మే 14: మాజీ సీఎం చంద్రబాబుపై కృష్ణా జిల్లా మైలవరం పోలీస్స్టేషన్లో ఇద్దరు న్యాయవాదులు శుక్రవారం ఫిర్యాదుచేశారు. లాయర్లు ఓ శ్రీను, పజ్జూరు సాంబశివరావు... కరోనా వేరియంట్ ఎన్ 440 కే ఏపీలో ఉందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్తామని, వారి ఆదేశాల మేరకు వ్యవహరిస్తామని ఎస్ఐ రాంబాబు తెలిపారు.