తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్ స్వప్నపై కేసు

ABN , First Publish Date - 2021-04-04T00:48:30+05:30 IST

మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో దొంగ ఓటేసిన తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తాటికొండ

తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్ స్వప్నపై కేసు

హైదరాబాద్: మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో దొంగ ఓటేసిన తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తాటికొండ స్వప్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనకు ఓటు హక్కు లేకున్నా ఆమె దొంగ ఓటు వేశారని.. కాంగ్రెస్‌ నేతలు సాక్ష్యాధారాలతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్నికల ప్రధాన అధికారి స్పందిస్తూ చైర్‌పర్సన్‌పై కేసు నమోదు చేయాలని కలెక్టర్‌‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా సహాయ ఎన్నికల అధికారి మోతీలాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాటికొండ స్వప్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. 


ఈ నెల 14 మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఓటరు ఇంటి పేరు స్వప్న ఇంటి పేరు ఒకటే కావడంతో ఆమె ఎవరికి అనుమానం రాకుండా ఓటు వేశారనే ప్రచారం జరుగుతోంది. తోటికోడలు పేరుతో స్వప్న ఓటు వినియోగించుకున్నారనే అభియోగంతో కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2021-04-04T00:48:30+05:30 IST