దమ్మాలపాటిపై చీటింగ్ కేసు నమోదు
ABN , First Publish Date - 2020-09-26T19:16:50+05:30 IST
మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్పై కేసు నమోదైంది.
గుంటూరు: మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్పై కేసు నమోదైంది. ఈ మేరకు మంగళగిరి రూరల్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదయింది. దమ్మాలపాటి కుటుంబం తనను మోసం చేసిందని.. రిటైర్డ్ లెక్చరర్ కోడె రాజా రామ్మోహన్ ఫిర్యాదు చేశారు. మొత్తం నలుగురిపై 420, 406, 506, 120బి రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దమ్మాలపాటి కుటుంబ సభ్యుల భాగస్వామ్యంతో..రామ్మోహన్ కృష్ణాయపాలెం లేక్ వ్యూ అపార్ట్మెంట్లు నిర్మించారు. ప్లాట్ విషయంలో తనను మోసం చేశారని రామ్మోహన్ ఫిర్యాదు చేశారు.