NRI మహిళపై కేసు నమోదు.. టీవీ షో లైవ్లో మాట్లాడుతూ చేసిన కామెంట్స్తో..
ABN , First Publish Date - 2021-12-01T22:55:08+05:30 IST
ఇటలీలో నివసిస్తున్న మహిళపై కేరళ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్నేహితుడికి మద్దతుగా నిలిచి.. అత్యాచార బాధితురాలి వివరాలను బయటపెట్టిన నేరం కింద ఆమెపై పోలీసులు కేసు నమో
ఎన్నారై డెస్క్: ఇటలీలో నివసిస్తున్న మహిళపై కేరళ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్నేహితుడికి మద్దతుగా నిలిచి.. అత్యాచార బాధితురాలి వివరాలను బయటపెట్టిన నేరం కింద ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
కేరళకు చెందిన మాన్సన్ మవున్కల్పై సీబీఐ, ఈడీ పలు కేసులు నమోదు చేసింది. అలాగే ఈయన ఓ మైనర్పై రెండేళ్లపాటు లైంగిక వేధింపులు జరిపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కేసు కోర్టులో విచారణ దశలో ఉంది. ఈ క్రమంలోనే ఇటలీలో నివసిస్తున్న అనిత పుల్లయిల్ అనే మహిళ మాన్సన్ మవున్కల్కు మద్దతుగా నిలిచింది. ఓ టీవీ షోలో పాల్గొని స్నేహితుడికి సపోర్ట్గా మాట్లాడుతూ.. ఆ మైనర్ బాలిక వివరాలను బహిర్గతం చేసింది. దీంతో బాధితురాలి తరఫు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేరళ క్రైం బ్రాంచ్ పోలీసులు ఐపీసీ 228 ఏ(1) సెక్షన్ కింద ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అనిత దోషిగా తేలితే.. ఆమెకు రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. వరల్డ్ మలయాళీ ఫెడరేషన్లో అనిత సభ్యురాలు.