ఉపాధ్యాయుడిపై గృహ హింస చట్టం కింద కేసు నమోదు

ABN , First Publish Date - 2022-01-23T05:37:57+05:30 IST

ఉపాధ్యాయుడు నాగ వెంకటేశ్వర్లుపై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేసినట్లు నందికొట్కూరు ఎస్‌ఐ వెంకటరమణ తెలిపారు.

ఉపాధ్యాయుడిపై గృహ హింస చట్టం కింద కేసు నమోదు

 నందికొట్కూరు రూరల్‌, జనవరి 22 : ఉపాధ్యాయుడు నాగ వెంకటేశ్వర్లుపై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేసినట్లు నందికొట్కూరు ఎస్‌ఐ వెంకటరమణ తెలిపారు. బాధితురాలి కథనం మేరకు.. నందికొట్కూరు మండలంలోని కొణిదేల గ్రామానికి చెందిన బత్తుల చిన్నరాముడు కుమార్తె లక్ష్మిని నంద్యాల పట్టణానికి చెందిన ఎంపీయూపీ పాఠశాల ఉపాధ్యాయుడు పల్లపు నాగ వెంకటేశ్వర్లుకు ఇచ్చి 2018లో వివాహం చేశారు. కొంతకాలంగా భర్తతోపాటు అత్తామాలు లక్ష్మిని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. అంతేగాకుండా కొట్టి ఇంటి నుంచి గెంటివేశారు. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు నాగ వెంకటేశ్వర్లుపై గృహహింస చట్టం కింద కేసు నమోదు చేశారు

Updated Date - 2022-01-23T05:37:57+05:30 IST