లాక్డౌన్ అతిక్రమించిన వారిపై కేసులు
ABN , First Publish Date - 2020-03-30T09:07:55+05:30 IST
పట్టణంలో లాక్డౌన్ అతిక్రమించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మెయిన్ రోడ్డులో తెరిచి ఉంచిన
పిఠాపురం, మార్చి 29: పట్టణంలో లాక్డౌన్ అతిక్రమించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మెయిన్ రోడ్డులో తెరిచి ఉంచిన పలుమొబైల్ షాపుపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్ఐ అబ్ధుల్నబీ తెలిపారు. మరోవైపు నిబంధనలు పాటించకుండా మోటారు సైకిళ్లపై ఇద్దరు, ముగ్గురు ప్రయాణిస్తుండటంతో పోలీసులు కొరడా ఝుళిపించారు. ట్రాఫిక్ ఎస్ఐ శోభన్కుమార్ జరిపిన తనిఖీల్లో 16 వాహనాలపై కేసులు నమోదు చేయడంతో పాటు పలు వాహనాలు సీజ్ చేశారు.