లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవాలి

ABN , First Publish Date - 2021-11-28T04:21:54+05:30 IST

డిసెంబరు 11న నిర్వహించే లోక్‌అదాలత్‌లో ప్రీలిటిగేషన్‌ కేసులు, చిన్నచిన్న తగాదాలకు సంబంధించిన కేసులు, పెండిం గ్‌లో ఉన్నకేసులు పరిష్కరించుకోవాలని జిల్లా మూడవ అదనపు జడ్జి పినారాయణబాబు, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఆర్‌ ఉమామహేశ్వరి అన్నారు.

లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవాలి
ఆసిఫాబాద్‌లో మాట్లాడుతున్న జిల్లా మూడవ అదనపు జడ్జి పి నారాయణబాబు

ఆసిఫాబాద్‌ రూరల్‌, నవంబరు 27: డిసెంబరు 11న నిర్వహించే లోక్‌అదాలత్‌లో ప్రీలిటిగేషన్‌ కేసులు, చిన్నచిన్న తగాదాలకు సంబంధించిన కేసులు, పెండిం గ్‌లో ఉన్నకేసులు పరిష్కరించుకోవాలని జిల్లా మూడవ అదనపు జడ్జి పినారాయణబాబు, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఆర్‌ ఉమామహేశ్వరి అన్నారు. శనివారం కోర్టు ప్రాంగణంలో బార్‌ అసోసియషన్‌, పోలీసు అఫీషియల్స్‌తో సమావేశం నిర్వహించారు. సమావేశంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సతీష్‌ బాబు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. 

సిర్పూర్‌(టి): వచ్చేనెల 11న నిర్వహించే నేషనల్‌ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సిర్పూర్‌(టి) జూనియర్‌ సివిల్‌ జడ్జి పి రవి అన్నారు. శనివారం డివిజన్‌ పరిధిలోని పోలీసు అధికారులు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. లోక్‌ అదాలత్‌లో కేసులను పరిష్కరించుకోవాలన్నారు.

Updated Date - 2021-11-28T04:21:54+05:30 IST